తెలంగాణ పత్రిక (APR.13), George Reddy Osmania: ప్రముఖ విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జి రెడ్డి వర్ధంతి సందర్భంగా గజ్వేల్ బాలుర వసతి గృహంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో సభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ, 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (George Reddy Osmania) ఆధిపత్య వ్యవస్థను ఎదిరించి అట్టడుగు వర్గాల విద్యార్థుల హక్కుల కోసం జార్జి రెడ్డి శ్రద్ధతో పోరాడిన యోధుడని కొనియాడారు. ర్యాగింగ్, వివక్షత, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తీవ్ర ఉద్యమాలు నిర్వహించి, విద్యార్థి సమాజంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాడన్నారు.
జార్జి సమానత్వ సమాజాన్ని ఆకాంక్షించాడని, కమ్యూనిజం ద్వారానే దానిని సాధించవచ్చని నమ్మి ఆ మార్గంలో సాగాడన్నారు. మతోన్మాద శక్తులు ఆయన ఎదుగుదలను భరించలేక కిరాయి గుండాలతో హ*త్య చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఏప్రిల్ 10 నుండి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా జార్జి రెడ్డి వర్ధంతి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు కోట మహేందర్, గ్యార గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Read more: Read Today’s E-paper News in Telugu