Assembly Elections 2026 : దేశంలోని ఐదు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను Election Commission of India ప్రకటించింది.

ఈసారి ఎక్కువ రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.
Assembly Elections 2026 ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు పోలింగ్?
ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం:
- Kerala – ఏప్రిల్ 9
- Assam – ఏప్రిల్ 9
- Puducherry – ఏప్రిల్ 9
- Tamil Nadu – ఏప్రిల్ 23
- West Bengal – రెండు దశలు (ఏప్రిల్ 23, ఏప్రిల్ 29)
ఇటీవలి ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ దశల్లో ఎన్నికలు నిర్వహించడం విశేషం.
Assembly Elections 2026 ఎందుకు ఒకే దశలో ఎన్నికలు?
గత కొన్నేళ్లుగా పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు అనేక దశల్లో నిర్వహించడం సాధారణంగా మారింది.
కానీ ఈసారి ఎన్నికల కమిషన్:
భద్రతా ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయని పరిపాలనా సిద్ధత పూర్తయిందని భావించి తక్కువ దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఓటరు జాబితాల సవరణ పూర్తయింది
ఎన్నికల ముందు Special Intensive Revision ప్రక్రియను పూర్తిచేసి తుది ఓటరు జాబితాలను విడుదల చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ Gyanesh Kumar, ఎన్నికల కమిషనర్లు Sukhbir Singh Sandhu మరియు Vivek Joshi రాష్ట్రాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
హింస తగ్గే అవకాశం
ముఖ్యంగా West Bengalలో గత ఎన్నికల్లో 8 దశల్లో పోలింగ్ నిర్వహించగా, ఈసారి కేవలం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది ఎన్నికల అనంతర హింస తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మే, జూన్ నెలల్లో ప్రస్తుత అసెంబ్లీల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు సమయానికి నిర్వహించబడుతున్నాయి. కొత్త ప్రభుత్వాలు ఆలస్యం లేకుండా ఏర్పడేలా ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ ప్రకటించింది.
Read More: Read Today’s E-paper News in Telugu
