Telangana AP Heatwave IMD Warning: మార్చి, ఏప్రిల్, మే (MAM) సీజన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ హీట్వేవ్ రోజులు ఉండే అవకాశం ఉందని India Meteorological Department (IMD) హెచ్చరించింది.

IMD డైరెక్టర్ జనరల్ Mrutyunjay Mohapatra న్యూఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ, ఈసారి ఎండలు ప్రజారోగ్యం, నీటి వనరులు, విద్యుత్ డిమాండ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు.
Telangana AP Heatwave IMD Warning 45°C దాటే ఉష్ణోగ్రతలు?
IMD అంచనాల ప్రకారం:
తెలంగాణ, ఏపీలో 3 నుంచి 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ హీట్వేవ్ పరిస్థితులు ఉండొచ్చు
ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45°C దాటే అవకాశం ఉంది
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది
గత ఏడాది కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C వరకు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఏప్రిల్లో 42°C దాటింది.
Telangana AP Heatwave IMD Warning ప్రజలకు హెచ్చరిక
IMD ప్రకారం హీట్వేవ్ ప్రభావం వల్ల:
- వృద్ధులు, చిన్నపిల్లలు
- బహిరంగంగా పనిచేసే కార్మికులు
- ఇప్పటికే ఆరోగ్య సమస్యలున్నవారు
ఎక్కువ ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది.
లా నినా, ENSO ప్రభావం
ప్రస్తుతం ఈక్వేటోరియల్ పసిఫిక్ ప్రాంతంలో బలహీనమైన La Nina పరిస్థితులు కొనసాగుతున్నాయని IMD తెలిపింది. రాబోయే నెలల్లో తటస్థ El Nino Southern Oscillation (ENSO) పరిస్థితులు రావచ్చని అంచనా వేసింది.
ఫిబ్రవరిలో తక్కువ వర్షపాతం
IMD సమీక్ష ప్రకారం, ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 2001 తర్వాత కనిష్ఠ స్థాయిలో వర్షపాతం నమోదైంది. అలాగే చలికాలం ప్రభావం కూడా గణనీయంగా కనిపించలేదు.
మార్చి నుంచి మే వరకు తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu
