Indian Embassy Safety Advisory Gulf Iran: ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలు మరియు ఇరాన్లోని భారత దౌత్య కార్యాలయాలు భారతీయులకు అత్యవసర భద్రతా సూచనలు జారీ చేశాయి.

Indian Embassy Safety Advisory Gulf Iran దోహాలో భారత ఎంబసీ హెచ్చరిక
Embassy of India, Doha ఖతార్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు పంపే ఎమర్జెన్సీ అలర్ట్లను పాటించాలని, సైనిక ప్రాంతాల సమీపానికి వెళ్లకూడదని హెచ్చరించింది.
“అత్యవసరం తప్ప బయటకు వెళ్లవద్దు. సాధ్యమైనంత వరకు భవనాల లోపలే ఉండండి” అని స్పష్టం చేసింది.
యూఏఈలో అలర్ట్
Embassy of India, Abu Dhabi మరియు Consulate General of India, Dubai కూడా అత్యవసర ప్రకటన విడుదల చేశాయి.
యూఏఈలోని భారతీయులు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించాయి. ఎమర్జెన్సీ కోసం టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపాయి.
టెహ్రాన్లో పరిస్థితి
Embassy of India, Tehran ఇరాన్లో ఉన్న భారతీయులకు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరం లేని కదలికలు మానుకోవాలని, తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని తెలిపింది.
Indian Embassy Safety Advisory Gulf Iran అంతర్జాతీయ పరిణామాలు
ఇటీవల Donald Trump అమెరికా బలగాలు ఇరాన్పై భారీ సైనిక చర్యలు కొనసాగిస్తున్నాయని ప్రకటించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యమని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
గల్ఫ్ దేశాలు, ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్య కార్యాలయాలు సూచిస్తున్నాయి. స్థానిక అధికారుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కోరాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
