Telangana inter practical exam mass copying: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అవకతవకలు బయటపడటంతో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కఠిన నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో జరిగిన ఈ అవకతవకలపై స్పందించిన బోర్డు, 16 మంది ఎగ్జామినర్లు మరియు ల్యాబ్ అసిస్టెంట్లను భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షల నుంచి పూర్తిగా నిషేధించింది. సీసీటీవీ ఫుటేజీలో బయటపడిన అవకతవకలు బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పరీక్ష హాల్లో విద్యార్థులకు సమాధాన చిట్లు పంపిణీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి .
కొంతమంది ఎగ్జామినర్లు ఉద్దేశపూర్వకంగా హాళ్లను ఖాళీగా వదిలి బయట మెటీరియల్ ఉపయోగించేందుకు అవకాశం కల్పించారు పరీక్ష పూర్తయ్యేలోపే కొందరు విద్యార్థులకు మార్కులు కేటాయించిన ఘటనలు నమోదయ్యాయి మరికొందరు తమ మూల్యాంకన పనిని ఇతరులతో చేయించినట్లు బోర్డు గుర్తించింది అంతేకాదు, కొన్ని కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్లైన్ కావడం లేదా బ్లింక్ కావడం గమనించడంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా బోర్డు అనుమానిస్తోంది.
జీరో టాలరెన్స్ పాలసీ అమలు పరీక్షల నైతికతను కాపాడేందుకు ‘జీరో టాలరెన్స్ పాలసీ’ కింద తప్పిదానికి పాల్పడిన సిబ్బందికి ఎలాంటి సానుభూతి చూపబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ సిబ్బందికి పారితోషికం (Remuneration) ప్రయాణ భత్యం (TA) దినసరి భత్యం (DA) ఏవీ చెల్లించబోమని ప్రకటించింది.
Telangana inter practical exam mass copying ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మిగిలిన ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా సాగేందుకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న రిజర్వ్ సిబ్బందిని వెంటనే నియమించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులను బోర్డు ఆదేశించింది.
ఈ ఘటనతో
ఇంటర్ పరీక్షల పారదర్శకతపై మరోసారి చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
