Bangaru Telangana Nirmatha KCR: సంక్రాంతి పండుగ సందర్భంగా సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని జగ్గరావుపల్లి గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీలో పాల్గొన్న ఓ మహిళ, తన ముగ్గులో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పట్ల తన అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తపరిచింది.

Bangaru Telangana Nirmatha KCR గ్రామానికి చెందిన కొండవేని గంగ జమున అనే మహిళ, తన ముగ్గులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాల పేర్లను కళాత్మకంగా రాసింది. ఈ ముగ్గులో
- కాళేశ్వరం ప్రాజెక్టు
- రైతు బంధు
- కల్యాణ లక్ష్మి
- మిషన్ భగీరథ
- మిషన్ కాకతీయ
- కంటి వెలుగు
- షాదీ ముబారక్
వంటి పథకాల పేర్లు స్పష్టంగా దర్శనమిచ్చాయి.
అంతేకాకుండా తన నియోజకవర్గమైన చొప్పదండి పేరుతో పాటు,
“బంగారు తెలంగాణ నిర్మాత KCR” అనే నినాదాన్ని కూడా ముగ్గులో పొందుపరిచింది. ఈ ముగ్గు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది.
స్థానికులు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ వేళ ఇలా ముగ్గుల రూపంలో రాజకీయ భావజాలాన్ని, అభిమానం వ్యక్తపరచడం అరుదైన విషయమని తెలిపారు. ఈ ముగ్గు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, కేసీఆర్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నాయి.
సంక్రాంతి పండుగకు సంప్రదాయ కళలతో పాటు ప్రజల భావోద్వేగాలు, రాజకీయ అభిమానం కూడా కలిసివచ్చిన ఈ సంఘటన జగ్గరావుపల్లిలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.
Read More: Read Today’s E-paper News in Telugu
