
TELANGANA PATRIKA(MAY30) , కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం వరకు 38,165 మంది రైతుల నుంచి 591 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో వెల్లడించారు.జిల్లాలో యాసంగి సీజన్ వడ్ల సేకరణ కోసం మొత్తం 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 30-5-2025 వరకు జిల్లాలోని 38,165 మంది రైతుల నుంచి రూ.591 కోట్ల 44 లక్షల విలువైన 2,54,930 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. వీటిలో 2,25,211 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 35,707 మంది రైతుల ఖాతాలో 478కోట్ల 71 లక్షల రూపాయలు జమ అయ్యాయని వెల్లడించారు.ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, జిల్లాలోని 153 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు వెల్లడించారు చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని స్పష్టం చేశారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గత మూడు రబీ సీజన్ లలో ధాన్యం సేకరణ వివరాలు..
- రబీ సీజన్ (2022- 2023) 30-05–2023 రోజు వరకు జిల్లాలో 1,77,038 మెట్రిక్ టన్నుల ధాన్యం..
- రబీ సీజన్ (2023- 2024) 30-05-2024 రోజు వరకు 2,52,162 మెట్రిక్ టన్నుల ధాన్యం..
- ఈ రబీ సీజన్ (2024- 2025) 30- 05-2025 ఈ రోజు వరకు 2,54,930 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు.
Read More: Read Today’s E-paper News in Telugu