
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులతో ముఖాముఖి చర్చ
TELANGANA PATRIKA(MAY26) , కొడిమ్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం పరిధిలో మే 23 నుంచి 25, 2025 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీవో ఈ. స్వరూప పర్యవేక్షణలో జరిగిన ఈ ఇంటర్వ్యూలలో మొత్తం 1,772 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాజీవ్ యువ వికాసం అభ్యర్థులతో ముఖాముఖి…! కేటగిరీల వారీగా హాజరు వివరాలు
ఎంపీడీవో స్వరూప వివరాల ప్రకారం, పథకానికి హాజరైన దరఖాస్తుదారుల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఎస్సీ: 558
- ఎస్టీ: 61
- బీసీ: 1,024
- మైనారిటీ: 72
- క్రిస్టియన్: 4
- ఈబీసీ: 53
దరఖాస్తుల పరిశీలన – గ్రామాల వారీగా సమీక్ష
ఈ పథకం కోసం స్వయం ఉపాధికి సంబంధించిన వ్యక్తిగత రుణాల కోసం యువతీ, యువకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలానికి చెందిన వివిధ గ్రామాల దరఖాస్తులను పరిశీలించినట్లు ఎంపీడీవో స్వరూప తెలిపారు.
ఇంటర్వ్యూలకు హాజరైన అధికారులు
ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో ఎంపీడీవో స్వరూపతో పాటు మండల ప్రత్యేక అధికారి, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu